నేడు కేంద్ర కేబినెట్ సమావేశం… లాక్ డౌన్ దిశగా?

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా [more]

Update: 2021-05-05 01:15 GMT

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కనీసం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి, మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే అవకాశముంది.

Tags:    

Similar News