బ్రేకింగ్: వైసీపీ నేతను విచారిస్తున్న సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈరోజు వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న వివేకా [more]

Update: 2020-07-29 05:04 GMT

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈరోజు వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న వివేకా కుమార్తె సునీతను సీబీఐ అధికారులు ఏడు గంటల పాటు విచారించారు. సస్పెన్షన్ కు గురైన సీఐ శంకరయ్యను కూడా నిన్న సీబీఐ అధికారులు విచారించారు. ఈరోజు పులివెందుల వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని విచారించనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. వీరితో పాటు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు కూడా సీబీఐ విచారణకు హాజరయ్యే అవకాశముంది.

Tags:    

Similar News