Srilakshmi : శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్

సీబీఐ కోర్టు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి [more]

Update: 2021-09-23 14:31 GMT

సీబీఐ కోర్టు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News