బ్రేకింగ్ : 14 తర్వాత లాక్ డౌన్ సడలిస్తారు కానీ? అక్కడ మాత్రం?

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగించడంపై మంత్రివర్గం ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద లాక్ డౌన్ ను విధించాలని మంత్రుల బృందం [more]

Update: 2020-04-08 03:50 GMT

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగించడంపై మంత్రివర్గం ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద లాక్ డౌన్ ను విధించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలంటూ దాదాపు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. అయితే విద్యాసంస్థలు, మతపరమైన సంస్థల వద్ద మే 15వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కొనసాగించాలని మంత్రుల బృందం పేర్కొంది. ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల వద్ద కూడా లాక్ డౌన్ ను విధించాలని సిఫార్సు చేసింది. లిక్కర్ షాపులకు కూడా వేళలను కుదించి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్షంతో చర్చించిన తర్వాత లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. దేశ వ్యాప్తంగా గుర్తించిన హాట్ స్పాట్ లతో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తారు.

Tags:    

Similar News