జయరామ్ హత్య కేసులో కొత్త కోణాలు

కృష్ణా జిల్లాలో కారులో అనుమాన్సద స్థితిలో మృతి చెందిన చిగురుపాటి జయరామ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరిని [more]

Update: 2019-02-02 07:57 GMT

కృష్ణా జిల్లాలో కారులో అనుమాన్సద స్థితిలో మృతి చెందిన చిగురుపాటి జయరామ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. జయరామ్ కి సంబంధించిన లావాదేవీలు శిఖా చౌదరి చూసుకునేది. ఆయనకు సంబంధించిన షేర్స్ కూడా ఇటీవల శిఖా చౌదరి పేరుపైకి బదిలీ అయ్యాయని తెలుస్తోంది. ఇక, తాజాగా శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ తో కూడా జయరామ్ కి కొంత వివాదం ఏర్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. శిఖా చౌదరిని వదిలేయాల్సిందిగా రాకేష్ ను కోరిన జయరామ్ భారీగా డబ్బులు ఆఫర్ చేశాడని సమాచారం. అయితే, ఈ డబ్బును రాకేష్ కు ఇవ్వలేదు. దీంతో జయరామ్ మృతిలో వీరిద్దరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. జయరామ్ పై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News