లోయలో పడిన బస్సు... 11 మంది మృతి

Update: 2018-08-21 08:37 GMT

జమ్మూ కశ్మీర్ లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కిష్టవర్ జిల్లాలోని మచైల్ మాత ఆలయానికి వెళ్తున్న ప్రమాణికులు ఈ బస్సులో ఉన్నారు. ఈ ఘటనలో కేవలం ఐదేళ్ల బాలిక మినహా మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలో సోమవారం ఓ వాహనంపై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు.

Similar News