మోక్షం కోసమే 11 మంది ఆత్మహత్య..?

Update: 2018-07-02 09:04 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కుటుంబం మొత్తం అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో కే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక వృద్ధురాలు మాత్రం గొంతు తెగి మరణించగా, మిగతా 10 మంది ఒకే తరహాలు ఇంటి సీలింగ్ కు ఊరితో మరణించారు. వీరి నోటికి ప్లాస్టర్ వేయడం, కాళ్ల కట్టేసి ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పోలీసుల తనిఖీల్లో ఇంట్లో దొరికిన డైరీలో కొన్ని మూఢనమ్మకాలు రాసి ఉన్నాయి. ఒకేరకంగా చనిపోతే మోక్షం పొందుతారని డైరీలో ఉంది. దీంతో వారందరూ మోక్షం కోసం ఒకేసారి ఆత్మహత్య చేసుకుని మరణించారా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

పెరుగుతున్న అనుమానాలు

మృతుల్లో సోమవారం ఆరుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, మరణానికి ముందు ఎటువంటి పెనుగులాటలు జరగలేదని పోస్టుమార్టంలో తేలింది. డైరీలో ఉన్నట్లుగా మోక్షం కోసమే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. కానీ, మృతుల బంధువులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారు దేవుడిని, మతాన్ని నమ్మేవారు, కానీ, మూడనమ్మకాలు నమ్మరని అంటున్నారు. వారంతా చదువుకున్న వారని, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవని, ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో ఈ మరణాలపై అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి.

Similar News