త్వరలోనే రాజధాని బండారం బయటపెడతాం

రాజధాని అమరావతి పై త్వరలోనే స్పష్టత వస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. తుళ్లూరు రాజధాని రైతులతో సమావేశం అయిన ఆయన అమరావతిలో [more]

Update: 2019-12-05 12:23 GMT

రాజధాని అమరావతి పై త్వరలోనే స్పష్టత వస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. తుళ్లూరు రాజధాని రైతులతో సమావేశం అయిన ఆయన అమరావతిలో భూములను ముందుగానే కొని రాజధానిని టీడీపీ నేతలు ప్రకటించారన్నారు. రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. రాజధాని విషయంలో ఆమోదయోగ్యమైన రిజల్ట్ వస్తుందన్నారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. టీడీపీకి అనుకూలంగా రాజధానిలో జోనింగ్ చేశారన్నారు. బినామీల పేర్లతో టీడీపీ నేతలకు భూములు ఉన్నాయన్నారు. పరిటాల సునీత, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, హెరిటేజ్ యనమల వియ్యంకుడు, నారాయణ, పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు పేరిట భూములున్నాయన్నారు. అకౌంటెంట్లు, డ్రైవర్ల పేర్లమీద కూడా భూములు కొనుగోలు చేశారన్నారు. దళితులకు చెందని అసైన్డ్ భూములను కూడా కాజేశారన్నారు.

Tags:    

Similar News