కేశినేనితో ఎలాంటి విభేదాలు లేవు

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నానితో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేస్తామని [more]

Update: 2021-02-20 01:03 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నానితో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. కిందిస్థాయిలో కొన్ని అపోహలు మాత్రం ఉన్నాయని, వాటిని త్వరలో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. విజయవాడలో అధిక సంఖ్యలో వార్డులు గెలిచి టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని బుద్దా వెంకన్న తెలిపారు.

Tags:    

Similar News