జగన్ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నట్లు?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్ మీడియా ముందుకు ఎందుకు [more]

Update: 2020-04-29 06:45 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. జగన్ అవగాహన లేమితోనే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమయిందన్నారు. చివరకు రాజ్ భవన్, ఆరోగ్యశాఖ మంత్రి బంగ్లాలోకి కూడా కరోనా వైరస్ సోకిందన్నారు. అయినా జగన్ కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం దక్షిణభారత్ లోనే ఏపీ కరోనా కేసుల్లో మొొదటి స్థానంలో ఉందన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయకుండా కరోనా కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని బుద్దా వెంకన్న కోరారు.

Tags:    

Similar News