బాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకోం… వెంకన్న వార్నింగ్

చంద్రబాబు పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. వైసీపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు. తాము అధికారంలోకి [more]

Update: 2021-09-03 07:31 GMT

చంద్రబాబు పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. వైసీపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలా మాట్లాడిన నేతలందరికీ మానసిక చికిత్స అందిస్తామని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే వైద్య ఖర్చులు పెడతామని బుద్దా వెంకన్న సెటైర్ వేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆయనే ఆక్రమణలకు పాల్పడుతుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి భూ ఆక్రమణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.

Tags:    

Similar News