జగన్ చేతులెత్తేశాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్రమించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి [more]

Update: 2019-03-05 08:19 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్రమించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి కేసీఆర్ యుద్ధం చేస్తున్నారని, ప్రజల కోసం తాము యుద్ధం చేస్తామన్నారు. ఇందులో అంతిమ తీర్పు మాత్రం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. పార్టీ నడిపించడం జగన్ వల్ల కావడం లేదని కేటీఆర్ ను కేసీఆర్ పంపించారన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుందనే కేసీఆర్ తట్టుకోలేక ఇలా చేస్తున్నారని అన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని అందుకే కేసీఆర్ లా వేగంగా కేసులు పెట్టడం లేదని, అవసరమైతే పెడతామన్నారు. జీవీఎల్ మాటలకు విలువ లేదని, జీవీఎల్ మాటలను పట్టించుకోనన్నారు.

Tags:    

Similar News