రాజధానిపై చిట్టా మొత్తం బయటపెడతా

రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని లో జరిగిన జరిగిన అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. [more]

Update: 2019-08-26 11:36 GMT

రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని లో జరిగిన జరిగిన అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. రాజధానిలో తనకు గజం భూమి లేదని మాజీ కేంద్రమంత్రి ఒకరు అంటున్నారని, సవాల్ విసిరితే తాను నిరూపించడానికి సిద్ధమని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ విషయాలను త్వరలోనే బయటపెడతానని చెప్పారు. రాజధానిపై పవన్ అప్పుడొకలా..ఇప్పుడొకలా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని విషయంలో బీజేపీ కూడా గతంలో ఏం మాట్లాడిందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాజధాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు

Tags:    

Similar News