చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందా....?

Update: 2018-10-26 08:02 GMT

చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షనేతపై దాడి జరిగితే మానవత్వం ఉన్న మనిషయితే దానిని ఖండించి, దానిపై సమగ్ర విచారణ చేయించేవారని బొత్స అన్నారు. అసలు విషయాన్ని వదిలిపెట్టి...పవన్ ఎందుకు మాట్లాడాలి? గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోవాలి? బీజేపీ ఎందుకు ఖండించాలి? అని అనవసర రాద్ధాంతం చేస్తూ అసలు విషయాన్ని పక్క దోవపట్టిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న భాష, ఆయన హావభావాలను చూసి ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు ముఖంలోనే క్రూరత్వం కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన వెంటనే తాను ఎయిర్ పోర్ట్ కు వెళ్లానని, అక్కడ విషయాలను అడిగి తెలుసుకుంటున్న సమయంలోనే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి అనవసర కామెంట్లు చేశారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగేతే ఎవరైనా ఆసుపత్రికి వెళతారా? లేక పోలీస్ స్టేషన్ కు వెళతారా? అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు చిన్న మెదడు చిట్లిందన్నారు.

Similar News