నిమ్మగడ్డ అక్కడే ఎందుకున్నారు?

ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలోనే ఎందుకు ఉండిపోయారని, అక్కడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు [more]

Update: 2020-02-22 05:45 GMT

ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలోనే ఎందుకు ఉండిపోయారని, అక్కడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. నిమ్మగడ్డను భారత దేశానికి తిరిగి రప్పించుకునేందుకే జగన్ తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ సిట్ ఏర్పాటు చేయడంపై బోండా ఉమా ఎద్దేవా చేశారు. ఎనిమిది నెలల నుంచి అనేక అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఎందుకు ఏమీ చేయలేకపోయిందని బోండా ఉమ ప్రశ్నించారు. పాలన చేతకాకనే తుగ్గక్ చర్యలకు జగన్ ప్రభుత్వం దిగిందన్నారు. సిట్ ఏర్పాటుతో టీడీపీ భయపడబోదన్నారు. ఏం విచారణ చేసుకుంటారో? చేసుకోండని బోండా ఉమ సవాల్ విసిరారు.

Tags:    

Similar News