ఐటీ దాడులకు టీడీపీకి సంబంధం ఏంటి?

ఐటీ శాఖ దాడులకు, తెలుగుదేశం పార్టీకి లింకు పెడుతున్నారని, వాటికి, టీడీపీకి సంబంధం లేదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో [more]

Update: 2020-02-14 06:29 GMT

ఐటీ శాఖ దాడులకు, తెలుగుదేశం పార్టీకి లింకు పెడుతున్నారని, వాటికి, టీడీపీకి సంబంధం లేదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించిన మాట వాస్తవమేనని, అయితే ఎక్కడా ఈ దాడుల్లో భారీ మొత్తంలో డబ్బు లభించలేదని బోండా ఉమ స్పష్టం చేశారు. అవినీతి పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ అని ఆయన విమర్శించారు. ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి అవినీతిని కూడా జగన్ ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్నారు. సీీబీఐ జగన్ బెయిల్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చిందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News