ఘోర ప్రమాదం యాభై మంది గల్లంతు

గోదావరిలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరిలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునిగిపోవడతో దాదాపు యాభై మంది ప్రయాణికులు గల్లంతయినట్లు తెలుస్తోంది. పాపికొండలకు బోటులో వెళుతుండగా ఈ ప్రమాదం [more]

Update: 2019-09-15 11:26 GMT

గోదావరిలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరిలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునిగిపోవడతో దాదాపు యాభై మంది ప్రయాణికులు గల్లంతయినట్లు తెలుస్తోంది. పాపికొండలకు బోటులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో మొత్తం బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. పర్యాటక శాఖకు చెందిన బోటు ఈ ప్రమాదనికి గురయింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగి గల్లంతయిన వారిని వెతికేందుకు ప్రయత్నిస్తుంది. సహాయక చర్యలు చేపట్టాలని జగన్ అధికారులను, మంత్రులను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి తగ్గడంతో బోటుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఐదుగురి మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News