సీఎం అభ్యర్థిగా టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే

Update: 2018-09-25 12:51 GMT

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీఎల్ఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీఎల్ఎఫ్ నేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీసీల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం దిశగా బీఎల్ఎఫ్ పయనిస్తుందన్నారు. బీసీలను అన్ని పార్టీలు చిన్న చూపిస్తున్నాయని, కానీ బీసీలు మాత్రం పార్టీలను చూసి ఓట్లేస్తున్నారన్నారు. బీఎల్ఎఫ్ 65 స్థానాలను బీసీలకు కేటాయించిందన్నారు. బీసీలు వారి ఓటు విలువ తెలుసుకుని అందరూ కలిసి పోరాటం చేస్తే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్.కృష్ణయ్య గత ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఉండి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Similar News