ముస్లింలపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Update: 2018-07-27 11:56 GMT

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతల తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన కొందరు ఉత్తరాది నేతలు అవకాశం దొరికినప్పుడల్లా ముస్లింలపై నోరుజారుతుంటారు. బీజేపీ నేతలెవరూ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా చెబుతున్నా ఆ పార్టీ నేతలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ బీజేపీ ఎంపీ హరి ఓం పాండే ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ముస్లింలు 3-4 సార్లు పెళ్లీలు చేసుకుని 9-10 మంది పిల్లల్ని కంటారని పేర్కొన్నారు. వారికి చదువు కూడా చెప్పించరని, దీంతో ఆవారాలుగా తయారవుతారన్నారు. వారి జనాభా కూడా పెరిగిపోతుందని, ఇప్పుడు షరియా చట్టం కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్త పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Similar News