Bjp : నేడు గవర్నర్ ను కలవనున్న ఏపీ బీజేపీ నేతలు

టీటీడీ పాలక మండలి పై భారతీయ జనతా పార్టీ నేతలు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు [more]

Update: 2021-09-20 03:33 GMT

టీటీడీ పాలక మండలి పై భారతీయ జనతా పార్టీ నేతలు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కూడిన బృందం నేడు గవర్నర్ ను కలవనుంది. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరిట యాభై మందిని నియమించారని, ఇది టీటీడీ నిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ నేతలు అంటున్నారు. అదనంగా నియమించిన సభ్యులను వెంటనే తొలగించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను కాపాడాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు.

Tags:    

Similar News