బాబు దెబ్బకు మూడు పిట్టలు పడ్డాయి

సహజంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమే గొప్ప అని… తెలంగాణలో మాత్రం చంద్రబాబు దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ తో పాటు బీజేపీ అనే మూడు పిట్టలూ [more]

Update: 2019-01-31 12:50 GMT

సహజంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమే గొప్ప అని… తెలంగాణలో మాత్రం చంద్రబాబు దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ తో పాటు బీజేపీ అనే మూడు పిట్టలూ రాలిపోయాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేదన్నారు. చంద్రబాబు దెబ్బకు బీజేపీకి పడే ఓట్లు కూడా టీఆర్ఎస్ కు పడ్డాయన్నారు.

టీడీపీతో కలిస్తే….

ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీ పోయినట్లేనని జోస్యం చెప్పారు. ఇక, స్వంత పార్టీపైనా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరుతానో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానన్నారు. బీజేపీపై టీడీపీ భారీగానే బురదజల్లిందని, బీజేపీతో కలిసి పార్టీ ఏపీలో ఏదీ లేదన్నారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు సహాయం టీడీపీకి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన టీడీపీ ఇప్పుడు విమర్శించడం లేదన్నారు.

Tags:    

Similar News