అందుకే చంద్రబాబు డ్రామాలు..!

తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ అని ముందు నుంచి తాము చెబుతున్నామని, తాము చెప్పినట్లే ఇవాళ పోలింగ్ కు ముందు చంద్రబాబు డ్రామా చేశారని బీజేపీ [more]

Update: 2019-04-10 11:28 GMT

తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ అని ముందు నుంచి తాము చెబుతున్నామని, తాము చెప్పినట్లే ఇవాళ పోలింగ్ కు ముందు చంద్రబాబు డ్రామా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి టీడీపీ యధేచ్ఛగా డబ్బులు పంచుతోందని ఆరోపించారు. సత్తెనపల్లిలో ఏకంగా పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంచుతున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ… టీడీపీ నేతలపై ఐటీ దాడుల విషయంలో అనుమానాలు ఉన్నాయని, వారే ఫిర్యాదులు చేయించుకొని దాడులు చేయించుకొని సానుభూతి కోసం డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారని తాము ఎన్నో ఫిర్యాదులు చేసినా ఈసీ కేవలం కొంతమందిపైనే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో తనకు కావాల్సిన అధికారులను, తన మనుషులను చంద్రబాబు ముందుగానే కీలక స్థానాల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. పోలీసు వాహనాలు, ఆంబులెన్సుల్లో టీడీపీ డబ్బులు తరలిస్తోందన్నారు. చంద్రబాబు, టీడీపీ చర్యలను అడ్డుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు.

Tags:    

Similar News