జగన్ ను కలిసిన సోము

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బీజేపీ నేత సోము వీర్రాజు కలిశారు. ఆయనతో దాదాపు నలభై నిమిషాలు పాటు చర్చించారు. సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2019-11-11 13:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బీజేపీ నేత సోము వీర్రాజు కలిశారు. ఆయనతో దాదాపు నలభై నిమిషాలు పాటు చర్చించారు. సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం మంచిదేనని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేదన్నారు. విద్యా, వైద్య రంగంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ జరపాలని తాను జగన్ ను కోరానని సోము వీర్రాజు తెలిపారు. తాను జగన్ ను కలవడంలో రాజకీయ అంశం ఏదీ లేదని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే కలిశానని సోము వీర్రాజు తెలిపారు.

Tags:    

Similar News