బాబు ఆర్ఎస్ఎస్ నేతలను కలవాలనుకున్నారు

అబద్ధాలు చెప్పడంలో, ప్రచారం చేయడంలో దేశంలోనే చంద్రబాబును మించిన ఘనుడు లేరని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఆర్ఎస్ఎస్ [more]

Update: 2019-04-05 07:39 GMT

అబద్ధాలు చెప్పడంలో, ప్రచారం చేయడంలో దేశంలోనే చంద్రబాబును మించిన ఘనుడు లేరని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. వాస్తవానికి, కృష్ణా పుష్కరాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తే కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, కానీ ఆయన సమయం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీలో ఇంటెలిజెన్స్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి కలకత్తా వెళ్లి కాళ్లపై పడ్డారని పేర్కొన్నారు. ఇలా కలిసే బుద్ధి చంద్రబాబుకే ఉందన్నారు. చంద్రబాబును స్టిక్కర్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీ చెప్పడం సరైందన్నారు. మోడీ ప్రవేశపెట్టిన పథకానికి పేరు మార్చి చంద్రన్న భీమాగా చెప్పుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి అని వచ్చి ఆయన ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయారని ఆరోపించారు.

Tags:    

Similar News