కలిసే పోటీ చేస్తాం

బీజేపీ, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈరోజు బీజేపీ, జనసేనల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. రెండు [more]

Update: 2020-01-28 14:26 GMT

బీజేపీ, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈరోజు బీజేపీ, జనసేనల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని రాజధాని రైతులకు మద్దతు తెలపాలని సమావేశం నిర్ణయించింది. త్వరలోనే రాజధాని రైతులకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంగా ఉండాలని రెండు పార్టీలు నిశ్చయించాయి.

Tags:    

Similar News