బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి [more]

Update: 2020-08-26 03:20 GMT

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలసి పనిచేశారు. కుష‌్టురోగి బండి స్వయంగా లాగి ఆయన తన ఉదారతను చాటుకున్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరగడం వల్లనే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా సోకిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనను కలసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని భూమన కరుణా కర్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News