న్యాయపోరాటం చేస్తా

ప్రజలపై పన్నులు భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం పై న్యాయపోరాటం చేస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్లు [more]

Update: 2021-07-19 14:21 GMT

ప్రజలపై పన్నులు భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం పై న్యాయపోరాటం చేస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్లు పన్నులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా పన్నులు వేయడం ఏంటని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఆళ్లగడ్డలోని మున్సిపాలిటీలోని దుకాణాలకు ప్రభుత్వం మూడేళ్లకు 33 శాతం పన్నులు పెంచిందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. కొత్తగా జారీ చేసిన జీవోల ప్రకారం వృత్తి, వ్యక్తుల రేట్లను బట్టి పెంచడమేంటని ఆమె నిలదీశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు.

Tags:    

Similar News