పవన్ తో సమావేశం కంటే ముందుగా

బీజేపీ ముఖ్యనేతలు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో జరిగే సమావేశంలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై [more]

Update: 2020-01-16 04:48 GMT

బీజేపీ ముఖ్యనేతలు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో జరిగే సమావేశంలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపేీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవధర్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, పురంద్రీశ్వరి తదితరులు హాజరయ్యారు. అయితే పవన్ కల్యాణ్ తో జరిగే సమావేశంలో కేవలం రాజధాని అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలే కాకుండా వచ్చే నాలుగేళ్లలో రెండు పార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై కూడా రెండు పార్టీల నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే పవన్ కల్యాణ్ తో ప్రస్తవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News