బీజేపీ తొలి జాబితా విడుదల

పశ్చిమ బెంగాల్ లో అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ [more]

Update: 2021-03-07 01:51 GMT

పశ్చిమ బెంగాల్ లో అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిని నందిగ్రామ్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన మమత నామినేషన్ వేస్తున్నారు. బీజేపీ తొలి జాబితాలో మాజీ క్రికెటర్ అశోక్ దిండా మెయ్నా నుంచి పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News