సాయిరెడ్డీ…. నీ పాపం పండింది

కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయరెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఇరవై కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లు విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి బీజేపీ నేతలు ఘాటుగా [more]

Update: 2020-04-19 13:07 GMT

కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయరెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఇరవై కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లు విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి బీజేపీ నేతలు ఘాటుగా బదులిచ్చారు. జైలు పక్షి సాయిరెడ్డిని ఏపీ ప్రజలు గుర్తించరని అన్నారు. మీ పరిధిలో మీరు ఉండాలని బీజేపీ హెచ్చరించింది. సూట్ కేసులు మార్చే వ్యవహారం తమకు తెలియదని, అవినీతి కేసులను కూడా తాము ఎరగమని బీజేపీ పేర్కొంది. జైలు పక్షివి మత్రమే కాకుండా రాజకీయాల్లో అక్కు పక్షివి అంటూ ఘాటు వ్యఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి బురదలో బుడగవని పేర్కొంది. చీకట్లో చిల్లర లెక్కలు వేసుకోమని సూచించింది. పాపం పండే టైం వచ్చిందని బీజేపీ వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News