బ్రేకింగ్: నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న పవన్ సన్నిహితుడు

Update: 2018-09-14 04:54 GMT

సినీ నిర్మాత బండ్ల గణేష్ మరియు తెరాస ఎం ల్ సి భూపతి రెడ్డి ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే పి సి సి అధ్యక్షుడు N . ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నేతలు వీరితో కలసి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడానికి ఢిల్లీ చేరుకున్నారు. బండ్ల గణేష్ షాద్ నగర్ లేదా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎం ల్ సి భూపతి రెడ్డి ఉమ్మడి నిజామామాబాద్ లో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తుంది.

బండ్ల గణేష్, పవర్ స్టార్ కళ్యాణ్ మరియు మెగా కుటుంబానికి సన్నిహితుడైన విషయం తెలిసిందే.

Similar News