బీజేపీ దెబ్బకు కేసీఆర్ నిద్రకూడా పోలేదు

బీజేపీ దెబ్బకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రకూడా పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులతోనే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. అడుగడుగునా కేసీఆర్ [more]

Update: 2021-03-22 00:56 GMT

బీజేపీ దెబ్బకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రకూడా పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులతోనే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. అడుగడుగునా కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన ఉద్యోగులు, నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ రెండు ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన పీీవీ నరసింహారావు ఫొటో పెట్టుకుని గెలవాల్సిన దుస్థితి కేసీఆర్ కు పట్టిందన్నారు.

Tags:    

Similar News