అన్ని సర్వేలు మా వైపే.. విజయం మాదే

తెలంగాణలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని బండి [more]

Update: 2021-03-13 00:58 GMT

తెలంగాణలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. పట్టభద్రులు తమ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారని చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతితో పీఆర్సీని కేసీఆర్ ప్రకటించవచ్చు కదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News