ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక తీర్పే

బీజేపీ విజయానికి పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి కారణమని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. భాగ్యనగర ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించారని అన్నారు. కేసీఆర్ కుటుంబ [more]

Update: 2020-12-04 14:14 GMT

బీజేపీ విజయానికి పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి కారణమని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. భాగ్యనగర ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల కమిషనర్ అధికార పార్టీకి ఎన్నిరకాలుగా సహకారం అందించాలని ప్రయత్నించినా వీలుపడలేదన్నారు. అలాగే పోలీసులు కూడా వన్ సైడ్ గానే వ్యవహరించారన్నారు. అక్రమ కేసులు బనాయించారన్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు ఎక్కడా వెనక్కు తగ్గలేదన్నారు. కలసికట్టుగా టీఆర్ఎస్, ఎంఐఎం లు పనిచేసినా ప్రజలు మావైపే నిలిచారని చెప్పారు. అభివృద్ధి చేయకుండానే మాటలతో కేసీఆర్ కాలం గడిపేశారని బండి సంజయ్ విమర్శించారు. కబ్జాల మీద, కమీషన్ల మీద దృష్టి పెట్టారు కాని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని బండి సంజయ్ విమర్శించారు. రానున్న కాలంలో బలీయమైన శక్తిగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని బండి సంజయ్ తెలిపారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి అనేక కుట్రలు చేశారన్నారు.

Tags:    

Similar News