నేను అటువంటి వ్యక్తిని కాను: దత్తన్న మాట

టిక్కెట్ రాకుంటే పార్టీ మారే వ్యక్తిని కానని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను [more]

Update: 2019-03-23 06:11 GMT

టిక్కెట్ రాకుంటే పార్టీ మారే వ్యక్తిని కానని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను 1980లో రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి తనకు బీజేపీ అనేక అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. తనకు టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎప్పటికీ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

Tags:    

Similar News