బాలయ్య చిందులు… కత్తులు తిప్పుతారట..!

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి మీడియాతో గొడవ పెట్టుకొని బూతులు తిడుతూ జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. బుధవారం బాలయ్య హిందూపురంలో [more]

Update: 2019-03-27 12:55 GMT

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి మీడియాతో గొడవ పెట్టుకొని బూతులు తిడుతూ జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. బుధవారం బాలయ్య హిందూపురంలో ప్రచారం చేశారు. ప్రచారం ముగిశాక మార్గమధ్యలో ఆగారు. బాలయ్య వచ్చిన విషయం తెలుసుకొని సమీప గ్రామ ప్రజలు ఆయనను చూడటానికి వచ్చారు. చిన్న పిల్లలను ఆయన కసురుకున్నారు. ఇదంతా ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు వీడియో తీశారు. దీంతో బాలయ్యకు కోపం తలకెక్కింది. దీంతో వీడియో డిలీట్ చేయమని హెచ్చరిస్తూ బూతులు తిట్టారు. బాంబులు వేస్తానని, నరికి పోగులు పెడతానని, కత్తి తిప్పడం కూడా తెలుసని హెచ్చరించారు. రాయడానికి వీలులేని బూతులు తిట్టారు. జర్నలిస్టుపై చేయిచేసుకున్నారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఇలా కొట్టడం, తిట్టడం కొత్తేమీ కాదు. ప్రతీసారి ఫ్యాన్స్ పైన, ప్రజలపైన తన ప్రతాపాన్ని చూపించే బాలయ్య ఈసారి ఏకంగా జర్నలిస్టుపైనే చూపించారు.

Tags:    

Similar News