ప్రతిదీ కోడికత్తి అని అనుకుంటే ఎలా?

వైసీపీ లాగా తమకు డ్రామాలాడటం చేతకాదని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి అన్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగితే అది డ్రామాగా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. [more]

Update: 2021-04-14 01:12 GMT

వైసీపీ లాగా తమకు డ్రామాలాడటం చేతకాదని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి అన్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగితే అది డ్రామాగా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. జగన్ పై కోడికత్తి కేసు డ్రామా కాదా? అని ఆయన ప్రశ్నించారు. వివేకాహత్య కేసులో ఇంకా డ్రామా కొనసాగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక పథకం ప్రకారమే చంద్రబాబుపై దాడి చేశారని బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. తాము తలచుకుంటే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News