లాలూ పాలనను మించి బాబు....?

Update: 2018-10-22 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో లాలూప్రసాద్ యాదవ్ తరహా పాలన నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఏపీ బీజేపీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు.ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ వచ్చారు. ఈసందర్భంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారన్నారు. తెలుగు దోపిడీ పార్టీగా టీడీపీ మారిపోయిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు వచ్చిన సంస్థలను కూడా భయపెడుతున్నారన్నారు. అతి విలువైన హ్యాయ్ ల్యాండ్ ఆస్తులను కారు చౌకగా కొట్టేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. కేంద్రం నిధులు ఇస్తామంటున్నా వారికి రాజకీయప్రయోజనాలే ఎక్కువయ్యాయని విమర్శించారు.

Similar News