ayyanna : బోస్ డీకే తోనే లబ్ది పొందుతారా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సానుభూతి వస్తుందంటే జగన్ తన ముఖంపై తానే ఉమ్మేసుకునే [more]

Update: 2021-10-24 12:31 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సానుభూతి వస్తుందంటే జగన్ తన ముఖంపై తానే ఉమ్మేసుకునే రకమన్నారు. అంతేకాదు గతంలో కోడికత్తి తో డ్రామా చేసి సానుభూతిని పొందే ప్రయత్నం చేశారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఇప్పుడు అదే తరహాలో బోస్ డీకే పదం నుంచి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. ఇక జగన్ ఇప్పట్లో బోస్ డీకే పదాన్ని వదిలిపెట్టరని అయ్యన్న పాత్రుడు అన్నారు. తన తల్లిని దానికి జతచేర్చి సెంటిమెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నాడని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. తల్లిని, చెల్లిని తెలంగాణ రోడ్లపై వదిలేశారని ఎద్దేవా చేశారు. నిజంగా తల్లి పై ప్రేమ ఉన్న వారెవరూ ఇలా వ్యవహరించరన్నారు.

Tags:    

Similar News