అయ్యన్న సెటైర్లు విన్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. పైగా చంద్రబాబును వ్యాక్సిన్ [more]

Update: 2021-05-13 01:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. పైగా చంద్రబాబును వ్యాక్సిన్ కోసం సిఫార్సు చేయమంటారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఏసీబీ, సీఐడీలను పంపి సంగం డెయిరీని స్వాధీనం చేసుకున్నట్లే భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ లను స్వాధీనం చేసుకోమని ఎద్దేవా చేశారు. ఏసీబీ, సీఐడీలు పూనావాలాను ఎత్తుకుని రాలేరా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. వారిపై కడపలో కేసులుపెట్టించి పట్టుకురాలేరా? అని అయ్యన్న పాత్రుడు సెటైర్ వేశారు.

Tags:    

Similar News