ఆ 950 కోట్ల స్కామ్ వెనక ఎవరున్నారు?

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీలో 950 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకూ భూములను ఆక్రమించుకున్న వైసీపీ [more]

Update: 2021-06-26 07:31 GMT

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీలో 950 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకూ భూములను ఆక్రమించుకున్న వైసీపీ నేతలు ఆలీబాబా ..దొంగలుగా మారి మరుగుదొడ్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అమ్మఒడి కింద ఏడాదికి పదిహేను వేలు ఇచ్చే ప్రభుత్వం వెయ్యిరూపాయలు వెనక్కు తీసుకంటుందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఇలా ఏడాదికి రూ.450 కోట్లు రెండేళ్లకు 950 కోట్లు ఎవరు నొక్కేశారో చెప్పాలని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. ఈ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News