ఆ ఎనిమిది వేల కోట్లు ఏం చేశారు..? చెప్పాల్సిందే

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఇచ్చిన ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఏం చేశారో చెప్పాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. 8వేల [more]

Update: 2020-07-18 06:06 GMT

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఇచ్చిన ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఏం చేశారో చెప్పాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. 8వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టాలో చెప్పాలని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని, పీపీఈ కిట్లు కూడా వైద్య సిబ్బందికి ప్రభుత్వం అందించలేక పోయిందని అయ్యన్న విమర్శించారు. ఇక క్వారంటైన్ లో ఉన్న వారికి రెండు వేలు ఇస్తామని చెప్పారని, అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత కేవలం వంద రూపాయలు మాత్రమే చేతిలో పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

Tags:    

Similar News