ఏపీ బస్సులు ఇక తెలంగాణకు…?

ఆంధ్రప్రదేశ్ బస్సులు తెలంగాణలో తిరిగేందుకు అధికారుల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. 256 బస్సులు ఏపీ నుంచి తెలంగాణకు నడవనున్నాయి. బస్ భవన్ లో జరిగిన ఇరు [more]

Update: 2020-08-25 02:47 GMT

ఆంధ్రప్రదేశ్ బస్సులు తెలంగాణలో తిరిగేందుకు అధికారుల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. 256 బస్సులు ఏపీ నుంచి తెలంగాణకు నడవనున్నాయి. బస్ భవన్ లో జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1.11 లక్షల కిలోమీటర్లు తిరిగేవి. అయితే దీనిని తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. దీనిపై తర్వాత సమావేశంలో నిర్ణయిద్దామని ఏపీ ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 26 బస్సులు ఏపీ నుంచి తిరిగేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. వీటిలో ఎక్కువగా ఏపీ లోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ కు నడిచేవే ఎక్కువ కావడం విశేషం. నాలుగుదశల్లో బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.

Tags:    

Similar News