లేని పోని సమస్యలను సృష్టిస్తున్నారు

మాన్సాస్ వ్యవహారంలో అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. సిబ్బంది జీతాల సమస్య ఇంతవరకూ రాలేదని ఆయన చెప్పారు. దానిని [more]

Update: 2021-07-21 08:30 GMT

మాన్సాస్ వ్యవహారంలో అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. సిబ్బంది జీతాల సమస్య ఇంతవరకూ రాలేదని ఆయన చెప్పారు. దానిని అధికారులు సమస్యగా భావిస్తున్నారని అశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. సిబ్బంది లేకపోతే సంస్థకే మనుగడ ఉండదని అశోక్ గజపతి రాజు అన్నారు. వారు పనిచేసేదే జీతాల కోసమని, ఆ సంగతి ఈవోకు తెలియదా అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. జీతాలు అడిగితే ఎదురు కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు తీసుకోకుండా ఈవో పనిచేస్తారా? అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News