మెజారిటీ ఎంతవస్తుందో చెప్పగలరా?

తిరుపతి ఉప ఎన్నికలలో మెజారిటీ ఎంత వస్తుందో చెప్పగలరా అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు. 90 శాతం ప్రజల మద్దతు తమకే [more]

Update: 2021-04-18 01:27 GMT

తిరుపతి ఉప ఎన్నికలలో మెజారిటీ ఎంత వస్తుందో చెప్పగలరా అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు. 90 శాతం ప్రజల మద్దతు తమకే ఉందని చెబుతున్న వైసీపీ నేతలు పోలింగ్ శాతం తగ్గడంపై ఏమి సమాధానం చెబుతారన్నారు. రాజకీయంగా, నైతికంగా వైసీపీ ఓటమి ఖాయమయిందని అశోక్ బాబు జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే తిరుపతిలో దొంగ ఓటర్లను పెద్ద సంఖ్యలో దింపారని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News