asaduddin : ఒవైసీ ఇంటిపై దాడి…. అందుకేనట

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై హిందూసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి బయట ఉన్న గేట్ దగ్గర ధ్వంసం చేశారు. ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ [more]

Update: 2021-09-22 01:56 GMT

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై హిందూసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి బయట ఉన్న గేట్ దగ్గర ధ్వంసం చేశారు. ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. హిందువులకు ఒవైసీ క్షమాపణ చెప్పాలని హిందూసేన డిమాండ్ చేసింది. కాగా ఈ దాడి ఘటనలో పోలీసులు ఐదుగురు హిందూసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News