జగన్ పై అసద్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-12-01 11:52 GMT

ఇప్పటి పరిస్థితి చూస్తే తన స్నేహితుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేస్తారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఏమీ లేదని, పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం మధ్యే ఉంటుందన్నారు. ఈ పోటీలో జగన్ చాలా ముందున్నారని, ఇలానే కొనసాగి, మంచి అభ్యర్థులను బరిలో ఉంచితే జగన్ కచ్చితంగా 25 కి 25 పార్లమెంటు స్థానాలు విజయం సాధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో క్లీన్ స్వీప్ ఖాయం.....

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ తో కలవాలనడం సరికాదన్నారు. దేశంలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ కంటే బాగా నాయకత్వం వహించగలిగిన నేతలు ఉన్నారని పేర్కొన్నారు. మోదీని వ్యతిరేకించే వారు రాహుల్ గాంధీతో ఉండాలనడం సరికాదన్నారు. ఇద్దరికీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఏపీలో క్లీన్ స్వీప్ చేసే జగన్ కూడా కీలకమవుతారన్నారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవరని ఆయన పేర్కొన్నారు.

Similar News