బ్రేకింగ్ : 6గంటలుగా కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు గంటల నుంచి నామినేషన్ వేసేందుకు క్యూలో నిల్చున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కంటే [more]

Update: 2020-01-21 12:45 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు గంటల నుంచి నామినేషన్ వేసేందుకు క్యూలో నిల్చున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కంటే 45 మంది అభ్యర్థులు ముందు ఉండటంతో ఆయన మరికొద్ది గంటలు క్యూలో నిల్చోవాల్సి ఉంది. అయితే బీజేపీ డమ్మీ అభ్యర్థులను తన ముందు నిలబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. నిన్న నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన కేజ్రీవాల్ కు ప్రజలు పెద్దయెత్తున స్వాగతం తెలపడంతో నామినేషన్ వేసే సమయానికి అరవింద్ కేజ్రీవాల్ చేరుకోలేకపోయారు. దీంతో ఆయన ఈరోజు నామినేషన్ వేసేందుకు వచ్చినా ఆరు గంటల నుంచి క్యూ లో నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News