రాజధానిపై తమ్మినేని మళ్లీ

రాజధాని అమరావతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజధాని అమరావతి ఎడారి అన్న తమ్మినేని తాజాగా రాజధాని విశాఖలోనే ఉంటుందని స్పష్టం [more]

Update: 2019-12-24 05:17 GMT

రాజధాని అమరావతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజధాని అమరావతి ఎడారి అన్న తమ్మినేని తాజాగా రాజధాని విశాఖలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు, నాలుగు ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేస్తామంటే ఆందోళనలు ఎందుకని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో నివాసం ఉంటూ అమరావతిపై పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలోనే రాజధాని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం జనగ్ దమ్మున్న నాయకుడన్నారు. భూములు కొట్టేసినోళ్లే ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంటే ఉద్యమాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమకారుల మనసు మార్చాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తమ్మినేని అన్నారు.

Tags:    

Similar News