మా బంధం బలపడుతోంది

ఆంధ్రప్రదేశ్ తో సింగపూర్ బంధం రోజురోజుకు బలపడుతోందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో వెల్ కమ్ గ్యాలరీకి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన [more]

Update: 2019-01-10 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ తో సింగపూర్ బంధం రోజురోజుకు బలపడుతోందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో వెల్ కమ్ గ్యాలరీకి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. లింగాయపాలెం వద్ద స్టార్టప్ ఏరియాలో 50 ఎకరాలతో రూ.44 కోట్లతో వెల్ కమ్ గ్యాలరీ నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన ద్వారా ఏపీ, సింగపూర్ సంబంధాల్లో కీలకమైన ముందడుగు పడిందని, అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో నదుల అనుసంధానానికి, అమరావతి నిర్మాణానికి ప్లాన్, నైపుణ్యాలు వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి సింగపూర్ సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Tags:    

Similar News